Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులో లేని ఈవో
నవతెలంగాణ-యాదాద్రి
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లకిëనరసింహ స్వామి ఆలయం పున:ప్రారంభం తరువాత శనివారం గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మొదటిసారి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పిదప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించి గవర్నర్కు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం గవర్నర్కు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆలయ వంశపారంపర్యం ధర్మకర్త బి.నరసింహమూర్తి అందజేశారు.
అందుబాటులో లేని ఈవో
గవర్నర్ పర్యటన సందర్భంగా ఆలయ ఇన్చార్జి ఈవో గీతారెడ్డి అందుబాటులో లేరు. ఈవో లేకపోవడంతో గవర్నర్కు స్వామివారి ప్రసాదం ధర్మకర్త అందజేయడం చర్చనీయాంశమైంది. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్కు స్వాగతం పలకాల్సిన ఈవో లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.