Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హైకోర్టులో రిట్ దాఖలు
- ఆ జీవోపై యథాతథస్థితి ఉత్తర్వులిచ్చిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త జిల్లాలకు అనుగుణంగా టీచర్ల బదిలీలకు ఇచ్చిన జీవో 21లో మార్పులు తెస్తూ మరో జీవో 402 జారీ చేయడం చెల్లదని హైకోర్టులో రిట్ దాఖలైంది. జీవో 402 అమలును యథాతథంగా ఉంచాలని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీవో 402ను సవాల్ చేస్తూ కె తిరుపతిరెడ్డి మరో తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించారు.
కొత్త జిల్లాల్లో బదిలీలు జరిగిపోయిన తర్వాత పాత జీవో21కి సవరణ చేస్తూ మరో జీవో జారీ చేయడం చెల్లదని పిటిషనర్ వాదన. విచారణ ఈనెల ఆరో తేదీకి వాయిదా పడింది.