Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో దాసుసురేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో జేఎన్యూలోని స్టూడెంట్స్ కమ్యూనిటీ సెంటర్లో బీసీల వ్యూహాత్మక రౌండ్ టేబుల్ సమావేశాన్ని జే ఎన్ యూ ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ ములాయంసింగ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త పోరటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలు, బీసీ బిల్లు సాధన సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.