Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఖాజీ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముస్లిం సమాజానికి ఖాజీలు ఎంతగానో సేవ చేస్తున్నారని తెలంగాణ ఖాజీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నూరుల్ అసఫియ, మహ్మద్ అప్జల్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పరిధిలో వేరొకరిని నియమించొద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఖాజీలు విజ్ఞప్తి చేశారు ఈమేరకు మంగళవారం మంత్రిని ఖాజీలు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఖాజీ హోదా తమకు వారసత్వంగా వస్తున్నదనీ, తాము జరిపిస్తున్న పెండ్లిళ్లకు సంబంధించిన రికార్డులను ఏండ్ల తరబడి భద్ర పరిచామని గుర్తు చేశారు. కొత్తవారిని నియమిస్తే సమస్యలొస్తాయని వివరించారు. ఈ సమస్యపై మంత్రి స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మీర్మహ్మద్ ఖాదర్ అలీ, జహీరుద్దీన్, మున్సీబత్షా, లతీఫ్ అజహర్,అసీఫుద్దీన్ అరాంగీర్ తదితరులు ఉన్నారు.