Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కృతం సబ్జెక్టును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు విరమించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. తెలుగు భాషను రెండోభాషగా కొనసాగించాలని కోరాయి. ఈ మేరకు డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేష్, కార్యదర్శులు టి నాగరాజు, ఆనగంటి వెంకటేశ్, మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎక్కువమంది పేద విద్యార్థులు, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.