Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బుధవారం నుంచి ఈనెల పదో తేదీ వరకు కేరళలోని కన్నూర్లో జరిగే సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ఆ పార్టీ ప్రతినిధులు మంగళవారం ఉదయం కాచిగూడ నుంచి రైలులో బయలుదేరి వెళ్లారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, డిజి నరలసింహారావు, టి జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, జాన్వెస్లీ, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, పాలడుగు భాస్కర్తోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్రాములు, కాడిగల్ల భాస్కర్, ఆర్ సుధాభాస్కర్, కిరణ్చంద్ర, మల్లు నాగార్జునరెడ్డి, సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, మిడియం బాబురావు, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఇప్పటికే కేరళ చేరుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రతినిధులకు ఆ పార్టీ అఖిల భారత మహాసభల ఆహ్వానసంఘం ఘనంగా స్వాగతం పలికింది.