Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు చెప్పిన రాష్ట్రం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వడ్లను కేంద్రం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ చేసే రాస్తారోకో, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 6న జాతీయ రహదారుల రాస్తారోకో చేయడం వల్ల పాలు, కూరగాయల రవాణాకు ఆటంకాలు కలుగుతుందని కాకతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ వేసిన రిట్ను బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రం అనుమతి ఇవ్వకపోయినా రాస్తారోకో జరిగిందని, జనం ఇబ్బందులు పడ్డారని పిటిషనర్ చెప్పారు. దీనిపై పూర్తి వివరాలు నివేదించాలని రాష్ట్రానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత చెప్పారు. విచారణను ఏప్రిల్ మూడో వారానికి వాయిదా వేశారు.