Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయా
- రాహుల్తో భేటీ తర్వాత జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇక ముందు బహిరంగ విమర్శలు ఉండవనీ, మీరు కూడా చూడరని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. గతంలో నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని స్పష్టత ఇచ్చారు. భార్య నిర్మల, కుమారుడు భరత్సాయిరెడ్డి, కూతురు జయరెడ్డితో కలిసి జగ్గారెడ్డి బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆయనతో దిగిన గ్రూప్ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానన్నారు. 'తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఏ విధంగా నిలదీయాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే విషయాలపై రాహుల్ చర్చించారు. ఆ మూడు పార్టీలను ఎదుర్కోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు'. రాహుల్తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయానన్నారు. అప్పుడు చెప్పిన విషయాలేవీ గుర్తులేవని తెలిపారు. కాంగ్రెస్ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కషి చేస్తామని వివరించారు. ఇంక ముందు మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండబోవు. కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారు' అని చెప్పారు. తమకుటుంబ సభ్యులతో కలిసి రాహుల్గాంధీతో ఫొటో దిగడం ఎంతో ఆనందంగా ఉందనీ, అందుకే ఢిల్లీ వచ్చామని ఆయన వివరించారు.