Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో సమర్పణకు తుదిగడువు మే 6
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ (యూజీ) సహా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ-2022) ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధన పరాశర్ గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు. జూలై మొదటి/రెండో వారంలో రాతపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు వచ్చేనెల ఆరో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ వంటి 13 భాషల్లో ప్రశ్నాపత్రాలు రూపొందించి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈ పరీక్షలను 547 పట్టణాలు, 13 నగరాల్లో నిర్వహిస్తామని తెలిపారు. జనరల్ విద్యార్థులు రూ.650, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ.600, ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు, థర్డ్జెండర్ విద్యార్థులు రూ.550, విదేశాల్లో పరీక్షకు హాజరయ్యే వారు రూ.3 వేలు పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాలకు www.nta.ac.in, http://cuet.samarth.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.