Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ స్కీం ద్వారా ఆలస్య రుసుంతో రూ.వెయ్యి ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20వ తేదీ వరకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించాలని టైంటేబుల్ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఫీజు చెల్లించిన విద్యార్థులే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అర్హులని తెలిపారు. ఆన్లైన్లో డాటా అప్లోడ్ చేసేందుకు ఈనెల 21వ తేదీ వరకు అవకాశముందని వివరించారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి ఫీజు తీసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం www.bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.