Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) నోటిఫికేషన్ ఈనెల 11న విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమ వుతుందని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా జూన్ 18వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు గడువుందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.500తో జులై 12 వరకు, రూ.రెండు వేలతో 20 వరకు, రూ.ఐదు వేలతో 27వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఆగస్టు 22 నుంచి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం గ్రౌండ్లో ప్రారంభమవుతాయని తెలిపారు.