Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవోనెంబర్ 402 అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు జరపాలని సూచించారు. అప్పీల్ పరిష్కారం అయ్యేంత వరకు పరస్పర బదిలీల ప్రక్రియను వాయిదా వేయాలని తెలిపారు.