Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ నడుపుతున్న 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలో 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కోసం వచ్చేనెల 22న టీఎస్ఆర్జేసీ సెట్ నిర్వహిస్తామని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు హాజరౌతున్న రాష్ట్రంలోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందని తెలిపారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యార్థుల కోసం ఈనెల 30వ తేదీ వరకు పొడిగించామని వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం http://tsrjdc.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.