Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్కు నారాయణ పేట జిల్లా వాసుల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం, చిత్తనూర్ గ్రామపంచాయతీల పరిధిలో 470 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న బయో ఫ్యాక్టరీని వ్యతిరేకించాలని కోరుతూ గ్రామ వాసులు రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆయా గ్రామాల్లో పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, కాటం ప్రదీప్కుమార్ గౌడ్, వాకిటి శ్రీహరి, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన, ధరణి తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రాష్ట్ర చైర్మెన్ అన్వేష్రెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.