Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఢిల్లీలో ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష ముగియగానే మంత్రులు, నేతలు హైదరాబాద్ బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఢిల్లీ దీక్షా కార్యక్రమాన్ని సమీక్షించిన అనంతరం ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్టు సమాచారం.