Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం వైద్యంలో 18-59 వయస్సు వారికి కరోనా నుంచి రక్షణకు బూస్టర్ డోసుకు ఇవ్వడానికి అనుమతివ్వాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భవిష్యత్తులో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకుని అర్హులైన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు బుధవారం లేఖ రాశారు.
ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం 18 ఏండ్లు పైబడిన వారికి ఏప్రిల్ 10 నుంచి బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేవలం ప్రయివేటు ఆస్పత్రులకే అనుమతించింది. ఈ క్రమంలో ప్రయివేటుతో పాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వయస్సున్న వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని మంత్రి ఈ లేఖ రాశారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది బూస్టర్ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.