Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈదురుగాలులు వీచే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా పడొచ్చు. పశ్చిమ విదర్భ, మరఠ్వాడా మీదుగా కర్నాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి నెలకొంది. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నిజామాబాద్, నాంపల్లి, నిర్మల్ జిల్లా థానూర్, ఆదిలాబాద్ జిల్లా జైనథ్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.