Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైటెక్స్లో నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడారు) 11వ ఎడిషన్ హైదరాబాద్ ప్రోపర్టీ షో ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్నట్టు క్రెడారు హైదరాబాద్ అధ్యక్షులు పీ రామకష్ణారావు, ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. మూడ్రోజులు జరిగే ఈ ప్రదర్శనలో నగర వ్యాప్తంగా ఉన్న క్రెడారు సభ్య డెవలపర్లు, మెటీరియల్ వెండర్లు, బిల్డింగ్ మెటీరియల్ ఉత్పత్తిదారులు, కన్సల్టెంట్లు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రయివేటు ఆర్థిక సంస్థలు అన్నీ ఒకే గొడుగు కిందికి వస్తున్నాయని చెప్పారు. సొంతింటి కలను సాకారం చేసుకొనేలా ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్స్కు తగినట్లుగా డెవలపర్లు ప్రాపర్టీలను ప్రదర్శిస్తారని వివరించారు. టీఎస్ రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రీన్ బిల్డింగ్స్, రిటైల్ మరియు వాణిజ్య కాంప్లెక్స్, ఓపెన్ ప్లాట్స్ సహా అన్నిరకాల ఆస్తుల వివరాలు ఇక్కడ లభ్యమవుతాయని చెప్పారు. కోవిడ్ తర్వాత ఈ ఎడిషన్ ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వ్యక్తుల సరాసరి వయసు 35 సంవత్సరాలుగా ఉందనీ, గతంలో ఇది 50 ఏండ్లుగా ఉండేదని వారు విశ్లేషించారు. హైబ్రిడ్ పని సంస్కతితో పాటు అపార్ట్మెంట్ల కోసం డిమాండ్ పెరుగుతుందనీ, తక్కువ వడ్డీరేట్లకు గహ రుణాలను అందిస్తుండటం కూడా రియల్ ఎస్టేట్ పెరుగుదలకు కారణంగా ఉన్నాయని తెలిపారు.