Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సతీమణి వసుమతిదేవి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించడం పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ చెప్పారు. ఆమె మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆమె చిత్రపటానికి బాలమల్లేష్తోపాటు గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ జ్యోతి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లీ ఉల్లా ఖాద్రి, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు కె కాంతయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, మహిళా సమాఖ్య నాయకులు విజయలక్ష్మి పండిట్, పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఎ గోవింద్రావు, సోషల్ మీడియా ఇన్చార్జీ శ్రీమాన్ పూలమాలవేసి నివాళులర్పించారు.