Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో శనివారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-2) పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శనివారం నుంచి నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు, సోమవారం నుంచి ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 23న ఫలితాలు ప్రకటించడంతోపాటు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు. అదేరోజు తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు చివరి పనిదినం ఈనెల 23 అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులుంటాయి. ఇంకోవైపు రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జరుగుతాయి.