Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులూ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 24వ తేదీన ఆరో తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేరోజు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు ఈనెల 24వ తేదీ వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలనీ, పరీక్ష కేంద్రాల్లోకి మాస్క్ ధరించి రావాలనీ, భౌతిక దూరం పాటించాలని కోరారు. హాల్టికెట్లను http://telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.