Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ మహేందర్రెడ్డితో చర్చించిన జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతినెలా వెలువరిస్తున్న 'పునాస' సాహిత్యపత్రికను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపించేందుకు డీజీపీ ఎం మహేందర్రెడ్డి సానుకూలంగా స్పందించారని సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్లో డీజీపీ మహేందర్రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వచ్చిన మార్పులు, పాఠశాల విద్యలో ప్రధానంగా తెలుగు పాఠ్యాంశాల్లో వచ్చిన మార్పులపై ఆయన చర్చించారు. విస్తృత సాహిత్యకారుల గురించి పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా ఈతరం విద్యార్థులకు తెలంగాణ అస్తిత్వం అర్థమవుతుందని డీజీపీ వివరించారు. తెలంగాణ సాహిత్య అకాడమి వెలువరిస్తున్న సాహిత్య పత్రిక 'పునాస' రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని గౌరీశంకర్ కోరారు. ఇందుకు ఆయన అంగీకరించారని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా 'పునాస' పత్రిక వెలువడుతుందని తెలిపారు.