Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సామాజిక వేత్త సురవరం ప్రతాపరెడ్డి అని సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సురవరం 125 వ జయంతి ముగింపు ఉత్సవాలకు ఆహ్వానించేందుకు ఆయన కుటుంబ సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కుల మతాల నిర్మూలనతో పాటు సాహితీ , సామజిక వేత్త గా, పత్రికా సంపాదకులుగా ఆయన విశేష సేవలను అందించారని కొనియాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని అలంపూర్ వద్ద సురవరం విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆయన జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సురవరం జీవితంపై రూపొందించిన నాటకాన్ని ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో, హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రదర్శన నిర్వహించామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రదర్శించేందుకు సాంస్కృతిక శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సురవరం ప్రతాప రెడ్డి కుమారుడు డాక్టర్ కృష్ణ వర్ధన్, కుటుంబ సభ్యులు సురవరం కపిల్, నివేదిత, అనిల్ తదితరులు పాల్గొన్నారు.