Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లినికల్ సైకాలజిస్టుల నియామకం
- ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని ఇంటర్ బోర్డు తెలిపింది. వారిలో ఒత్తిడి, పరీక్షల పట్ల భయం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు క్లినికల్ సైకాలజిస్టులను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్లినికల్ సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్లను ఎంపిక చేశామని వివరించారు. వారు విద్యార్థులకు టెలిఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఒత్తిడి, అందుకు సంబంధించిన ఇతర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సేవలు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.