Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేందుకు వీలుగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ), సెంచురీయన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(సీయూటీఎమ్) మధ్య అవగాహనా ఒప్పందం సోమవారం కుదిరింది. విద్యార్థులకు ఆధునిక సేవలను అందించేందుకు వీలుగా శాటిలైట్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు ఒప్పంద పత్రాలపై సీఎం ఓఎస్డీ, ఎఫ్సీఆర్ఐ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, సెంచురీయన్ యూనివర్సిటీ కో ఫౌండర్, వైస్ ప్రెసిడెంట్ డీ. నరసింహారావు సంతకాలు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డిప్యూటీ డైరెక్టర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.