Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా)ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ..సర్వమత సారం ఒక్కటేననీ, మనషులంతా సోదర భావంతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఎమ్డీ రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు కె కె.నిరంజన్, కె. నాగమణి, మాధవి రెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణ్ రెడ్డి, కార్యదర్శులు వాణిరెడ్డి మనోహర్ చక్రవర్తి, నజీమ్ ఖాన్, దేశ్య నాయక్, బి.శైలజ, వాణి, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.ఎల్లారెడ్డి, ముర్తుజా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శుక్ల కుమార్, మేడ్చల్ అధ్యక్ష కార్యదర్శులు పి. సుధాకర్, రామకృష్ణ రెడ్డి, వికారాబాద్ అధ్యక్షులు బి. కృష్ణయ్య, కార్యవర్గ సభ్యులు షఫీయుద్దీన్, మునీర్, పి.శ్రీనివాస్ రెడ్డి, సైదులు సంగ్రామ్ రెడ్డి, చైతన్య, రఫీ తదితరులు పాల్గొన్నారు.