Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో వెయ్యి పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాతపరీక్ష ఆధారంగా కాకుండా ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఎంపిక చేసే అవకాశమున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్న సంగతి తెలిసిందే. వాటిలో జూనియర్ కాలేజీలుగా 208 కేజీబీవీలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. దీంతో 208లో ఇంటర్మీడియెట్ స్థాయి వరకు విద్యార్థినీలకు విద్య అందుతున్నది. దీంతో బోధనా సిబ్బంది అవసరమని అధికారులు భావిస్తున్నారు. అందుకే విద్యార్థినీలకు అధ్యాపకుల కొరతను తీర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశమున్నది.