Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎంఆర్ఈఐఎస్)లో 2022-23 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష వచ్చేనెల 15న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు టీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి బి షఫీఉల్లా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతిలో ప్రవేశాల కోసం వచ్చేనెల 22వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం జూన్ నాలుగో తేదీన పేపర్-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు రాతపరీక్షలుంటాయని వివరించారు. ఇతర వివరాలకు tmreis.telangana.gov.in వెబ్సైట్ను లేదా 040-23437909 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.