Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బి. రాజమౌళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ జీవో నెంబరు 875ను విడుదల చేశారు. రాజమౌళి డిప్యూటి డైరెక్టర్గా సమాచార శాఖలో విధులు నిర్వహించి ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే. తనను సమాచార శాఖ డైరక్టర్గా నియమించినందుకు ప్రగతిభవన్లో ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు. ఈసందర్భంగా నవతెలంగాణతో రాజమౌళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్ ప్రకారం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళతామని చెప్పారు.