Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్నగర్ ప్రాంతంలో నివాసముండే బల్ల రామస్వామి (80) తన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని ఎప్పటి మాదిరిగానే ఈ నెల 19వ తేదీన రాత్రి 12 గంటల సమయంలో చార్జింగ్ పెట్టి కుటుంబ సభ్యులందరూ పడుకున్నారు. అయితే 19వ తేదీ తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బ్యాటరీలో నుంచి మంటలు చెలరేగడంతో హాల్లో ఉన్న బల్ల రామస్వామి, అతని భార్య కమలమ్మ, కోడలు కృష్ణవేణి, మనుమడు కళ్యాణ్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే రామస్వామి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. గాయపడ్డ మరో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. రామస్వామి కుమారుడు బల్ల ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.