Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
నవతెలంగాణ-బేగంపేట్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రా బాద్ స్కందగిరి దేవాలయం సందర్శన సందర్భంగా విషాద ఘటన జరిగింది. ప్రత్యేక పూజల అనం తరం గవర్నర్ వెంట ఉన్న అటెండర్ రాజ్ కుమార్(47) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు రాజ్కుమార్ మార్గం మధ్యలోనే చనిపోయినట్టు తెలిపారు. మృతదేహాన్ని రాజ్ భవన్ తరలించారు.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.