Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో శనివారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం జరగనుంది. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ అమలు, ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం వంటి అంశాలపై చర్చించే అవకాశమున్నది. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టుల భర్తీ గురించి ఇందులో చర్చ జరగనుంది. ఇప్పటికే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.