Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేలోని వరంగల్ , ఖమ్మం మోటమర్రి , కొండపల్లి సెక్షన్న్లలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జ్కెన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ తనిఖీలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. పార్సిల్ కార్యా లయం, సర్క్యులేటింగ్ ఏరియాతో సహా స్టేషన్ పరిసరాలను పరిశీలించినట్టు తెలిపారు. స్టేషన్ల్లో ప్రయాణికుల వసతులను సమీక్షించటమేగాక, చేపట్టాల్సిన అభివృద్ధ్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు. వరంగల్లోని గూడ్స్ షెడ్ను సందర్శించి అక్కడ సరుకు రవాణా వసతులను పరిశీలించినట్టు పేర్కొన్నారు. హమాలీల వసతి గృహంతోతోపాటు వసతులను పరిశీలించినట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రధాన కార్యాలయం, డివిజన్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు.