Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి వడ్లను కొనేందుకు వీలుగా తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతత్వంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనీల్కుమార్ కూడిన ఈ కమిటీ సమావేశమైంది. ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్సీఐకి అందించే వడ్లు తదితర అంశాలపై చర్చించారు.