Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శనివారం నిర్వహించబోయే ఆర్టీసీ బోర్డు మొదటి సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ సంస్థ చైర్మెన్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం వినతిపత్రం సమర్పించామని జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, వాలంటరీ రిటైర్మెంట్ ప్రతిపాదనలు, ఆర్టీసీ విస్తరణ, వేతన సవరణ, జులై 2019 నుంచి రావాల్సిన ఆరు డీఏలు, సీసీఎస్, పీఎఫ్, రిటైర్ అయిన వారికి సెటిల్మెంట్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల సమస్యలు తదితరాంశాలపై చర్చించాలని కోరారు.