Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- గుమ్మడిదల
గేదెలకు నీరు తాగించి, వాటిని కడగడానికి చెరువు దగ్గరకు వెళ్లిన తల్లీ కొడుకులు ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో సోమవారం జరిగింది. ఎస్ఐ విజరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన తలారి లక్ష్మి(32), ఆమె కొడుకు తలారి బాలు (10) సోమవారం సాయంత్రం పశువులకు నీరు తాగించడానికి చెరువు దగ్గరకు వెళ్లారు. అనంతరం పశువులను కడిగే ప్రయత్నం చేయగా.. బాలు నీటిలో మునిగిపోయాడు. గమనించిన తల్లి.. అతన్ని కాపాడుదామని నీటిలోకి వెళ్లగా.. ప్రమాదవశాత్తు ఆమె కూడా మృతి చెందింది. మృతురాలి భర్త తలారి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.