Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాలుష్యం నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను పరిరక్షించాలని పర్యావరణ వేత్తలు డాక్టర్ నర్సింహారెడ్డి దొంతి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రిజర్వాయర్లు, చెరువులు, నీటి వనరుల సాంకేతిక సభ్యులు బి.వి.సుబ్బారావు, ఒయు రిటైర్డ్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత జీవో నెంబర్ 111లోని పారా నెంబర్ మూడులో గల ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే జీవో నెంబర్ 111కు సంబంధించి పూర్తి స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు.