Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు అధికారుల ప్రశంసలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత స్థాయి అధికారుల బృందం ప్రశంసించింది. బుధవారం సాయంత్రం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో తమిళనాడు అధికారుల బందం భేటీ అయింది. తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, మంచినీటి సరఫరా శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ శివదాస్ మీనా, గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ, జాయింట్ సెక్రెటరీ జాన్ లూయిస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పొన్నయ్య, చెన్నై కార్పొరేషన్ సీనియర్ అధికారులు కలిశారు. జవహర్ నగర్లో శాస్త్రీయ పద్ధతిలో డంప్ యార్స్డ్ నిర్వహణ, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు, స్వచ్ఛ్ ఆటోల వినియోగం, స్వచ్ఛ్ కార్యక్రమాలను పరిశీలించామని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.