Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చెప్పారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన అధికారులను అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ పథకం అమలులో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎంపిక చేసిన ఉత్తమ గ్రామాల్లో తొలి పది మనవేననీ, 20 ఊర్లలో తెలంగాణవే 19 ఉన్నాయని తెలిపారు. ఇదంతా ప్రణాళికాబద్ధం పల్లెప్రగతి నిర్వహించడం ద్వారానే సాధ్యమైనదన్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.