Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానోపాధ్యాయుడి తీరుపై విమర్శల వెల్లువ
- ములుగు జిల్లాలో ఘటన
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గొంది గోవర్ధన్ పలువురితో కలిసి మద్యం సేవించిన ఫొటో 'నవతెలంగాణ'కు చిక్కింది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మద్యం పార్టీ నిర్వహించడంపై సదరు ప్రధానోపాధ్యాయుడిని 'నవతెలంగాణ' వివరణ కోరగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో మద్యం పార్టీ చేసుకోవడం, అందులో ప్రధానోపాధ్యాయుడు కీలకంగా వ్యవహరించడం పట్ల మండల, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి స్పందించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.