Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భాషాపండిత పోస్టుల అప్గ్రెడేషన్కు మోక్షమెప్పుడని ఆర్యూపీపీటీఎస్ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషాపండితుల దశాబ్ధాల కలను సాకారం చేస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఐదేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని తెలిపారు. భాషాపండితుల పోస్టుల అప్గ్రెడేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వారికి మాత్రమే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.