Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా బుర్రి ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని తమ పార్టీ పొలిట్బ్యూరో ఆమోదిం చిందని వివరించారు. బుర్రి ప్రసాద్ ఖమ్మం జిల్లా విద్యార్థి ఉద్యమంలో 1991 నుంచి 1997 వరకు పనిచేశారని తెలిపారు. 1998లో రాష్ట్ర కేంద్రానికి వచ్చి ఆ రంగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఆ తర్వాత యువజనరంగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. అనంతరం 2020 నుంచి 2022 వరు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఆ సంఘం ప్రధాన బాధ్యతల్లో ఉన్నారని పేర్కొన్నారు.