Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఈ సంస్మరణ సభకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, న్యూడెమాక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వర్రావు, ఎంసీపీఐయూ నేత మద్దికాయల అశోక్ , రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వర్రావు తదితరులు హాజరు కానున్నారు.