Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ఆ వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందనీ, ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తలసేమియా, సికెల్సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కమలా సొసైటీ తలసేమియా రోగులకు మంచి సేవలను అందిస్తోందని హరీశ్రావు ప్రశంసించారు.