Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సర్కారుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.102కి పెంచడంతో సామాన్యులు దుకాణాలకు వెళ్లేందుకు సైతం భయపడే పరిస్థితి కల్పిస్తున్నదని ఈమేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెటేలా ఉన్నాయని చెప్పారు. దీనిని అతిపెద్ద ధరల పెంపుదల వ్యాఖ్యానించారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.