Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ సుధాభాస్కర్ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకులు రావుల వరప్రసాద్... తన కుమారుడు రణధీర్ వివాహం కవితతో జరిగిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో నవ తెలంగాణ దినపత్రిక అభివృద్ధి కోసం రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. అభ్యుదయ భావాలతో ప్రజాపక్షంగా వ్యవహరిస్తున్న ఆ పత్రికకు విరాళం ఇవ్వడం ద్వారా దాని అభివృద్ధికి తోడ్పడటం తనకు సంతోషదాయకమని ఆయన తెలిపారు. ఆర్థిక సాయం చేసిన వరప్రసాద్కు, ఆయన కుటుంబ సభ్యులకు నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.