Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంజాన్ పండుగ (ఈద్ ఉల్ ఫితర్ ) మంగళవారం జరగనున్నది. మసీదులు, ఈద్గామైదానాలు నమాజ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యయి. పర్వదినం నేపథ్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. రంజాన్ మాసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని తెలిపారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు.