Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈటీవీలో వీడియో జర్నలిస్టుగా పని చేస్తూ అనారోగ్యం బారినపడ్డ రాష్ట్ర ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అండగా నిలిచారు. ఆయన లంగ్, బ్రెయిన్ క్యాన్సర్కు అవసరమైన చికిత్సను ఉచితంగా అందించాలనీ, అందుకు చొరవ చూపాలని తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు మంత్రికి విన్నవించారు. సోమవారం కోకాపేట లోని ఆయన నివాసంలో, బాధితుడితో మంత్రిని కలిసి అనారోగ్య పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.... వెంకటేశ్వర్లుకు అవసరమైన సహాయం చేయాలనీ, మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందేలా అధికారులు మాట్లాడి చర్యలు తీసుకున్నారు. మంత్రి తక్షణం స్పందించి సహాయం చేయడం పట్ల వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.