Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఓయూకు వచ్చేందుకు రాహుల్గాంధీకి అనుమతిని తిరస్కరించడంతోపాటు కాంగ్రెస్ నాయకుల పట్ల నిరంకుశంగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ...మంగళవారం గాంధీభవన్ వద్ద మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వెంకట్, మానవతారారు ఆధ్వర్యంలో రాహుల్గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ చాంబర్ వద్ద ధర్నా చేస్తుండగా వారిని అక్రమంగా అరెస్టు చేశారనీ, పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వెంటనే విడుదల చేయాలనీ, లేకుంటే చంచల్గూడ జైలు వరకు రాహుల్ గాందీనిó పూలబాట వేసి తీసుకొస్తామని ఆయన హెచ్చరించారు.