Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సారెస్పీ జీరో పాయింట్ వద్ద ఘటన
నవతెలంగాణ-ముప్కాల్
ఎస్సారెస్పీలో ఈతకొట్టేందుకు దిగి ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ శివారులోని జీరోపాయింట్ వద్ద మంగళవారం జరిగింది. వారు జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన దానిష్ ఖాన్, ముదాసీర్, అమాన్(18), సమీర్(18) (పోచంపాడ్) ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించడానికి మంగళవారం వచ్చారు. స్నానానికని నదిలోకి దిగారు. ఈ క్రమంలో అమాన్, సమీర్ నదిలో మునిగిపోయారు. మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గజ ఈతగాళ్లు నదిలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రంజాన్ పండుగ వేళ ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.